వారి సమస్యలు పెరిగాయి ఎందుకంటే
వారిద్దరూ జరిమానాలు, కోర్టు ఖర్చులు మరియు పరిశీలన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఒక సమస్య అనేక ఇతర సమస్యలకి దారితీసింది కాని అది అంతటితో ఆగిపోదు. ఈ ఇద్దరూ వారి జరిమానాలు, ఖర్చులు మరియు అన్నింటినీ చెల్లించినప్పుడు, అది పోలీసు రికార్డుల్లోకి
వెళ్తుంది, తద్వారా ప్రతి ఒక్కరూ జీవితాంతం వారిని అపరిపక్వ వ్యక్తులుగా పరిగణిస్తూ, నమ్మకంలేని హింసాత్మక వ్యక్తులుగా తీర్పు ఇస్తారు.
కోపం నిగ్రహించుకోనే విషయంలో ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం, ఈ దృష్టాంతంలో నొక్కిచెప్పడం అనేది ఉపయోగించబడింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి పొరుగువాళ్ళతో అబద్ధాలు వ్యాప్తి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎదుర్కొంటారు.
పుకార్లకు గురైన వ్యక్తి తన స్నేహితుడి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు: 'నాకు తాగుడు సమస్య ఉందని
మీరు ప్రజ
లకు ఎందుకు చెబుతున్నారు?'. అవతలి వ్యక్తి, 'మీకు మద్యపాన సమస్య
ఉందని నేను ఎవరికీ చెప్పలేదు' అని అంటాడు. 'తప్పు!', అని అంటూ, 'మీరు అబద్దాలు
చెప్పని
నా బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పారు' అని మొదటి వ్యక్తి అంటాడు. 'సరే, నేను మీ ఇంటికి వచ్చిన ప్రతిసారీ మీరు తాగుతున్నందున మీకు తాగుడు సమస్య ఉందని నేను అనుకున్నాను'.
'మీరు నా ఇంటికి వచ్చిన ప్రతిసారీ నేను
తాగుతు
న్నాను కాబట్టి నాకు సమస్య ఉందని కా
దు. నా పేరుమీద బురద చల్లడానికి మిమ్మల్ని నేను అనుమతించను మరియు మీరు నా గురించి అబద్ధాలు చెబుతూ ఉంటే, నా ఇంటికి మళ్ళీ రావడానికి నేను మిమ్మల్ని అనుమతించను. స్నేహితులెవ్వరూ తమ స్నేహితులను బాధించరు. కాబట్టి, మీకు నాతో ఏమైనా సమస్యలు ఉంటే, వాటిగురించి నా వెనుక మాట్లాడే బదులు వాటిని నాతో మాట్లాడండి '.
ఎంత మంచి ఫలితమో కదా!
ఈ వ్యక్తి తన గురించి తాను నొక్కిచెప్పి ఒక మంచి పని చేసాడు మరియు ఫలితాలు ఖచ్చితంగా విజయవంతమవుతాయి. తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం. '
నన్ను నిజంగా క్షమించు; నిన్ను బాధపెట్టాలని నా ఉద్దేశ్యం కాదు. నాకు మీతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈసారి మీతో మాట్లాడతాను. అయినప్పటికీ, నేను మీ ఇంటివైపు వచ్చే ప్రతిసారీ మీరు త్రాగటం వలన మీకు మద్యపాన సమస్య ఉందేమో అని నేను ఇప్పటికీ ఆందోళన చెందుతున్నాను '. 'సరే, మా ఇంటికి వెళ్లి విషయం చర్చించుకుందాం'.
తేడా నాటకీయంగా ఉంది, కాదంటారా? మరి ఇలా ఎందుకు జరిగిందంటే కోపం నిగ్రహించుకోవడాన్ని గురించి వాళ్ళల్లో ఒకరు ఆలోచించారు!
1 కోపం నిగ్రహించుకోవడం
ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు కోపం అనేది సమాజంలో పెరుగుతున్న సమస్య. నడిరోడ్డుపై జరిగే గొడవలే ఒక మంచి ఉదాహరణ
అది ఎందుకు అని చెప్పడానికి నేను అర్హుణ్ణి కాను, కానీ సిద్ధాంతాలు వీటి నుండే వచ్చాయి:
* విజయం సాధించడానికి తల్లిదండ్రుల ఒత్తిడి ద్వారా ప్రేరేపించబడిన ఒత్తిడి
* తోటివారి ఒత్తిడి
* పరీక్షలలో వైఫల్యం వల్ల కలిగే ఆందోళన
* ఆహారం - ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరిగింది
* టెలివిజన్, సినిమాలు మరియు ప్రముఖుల ప్రభావం
* సమాజంలో పెరిగిన భౌతికవాదం
* విలువైన ఆధ్యాత్మిక నడిపింపు లేకపోవడం
* అధికారం పట్ల తగ్గిన గౌరవం
* విభిన్న సాంస్కృతిక ప్రభావాలు
* పాప్ సంగీతం
* రాజకీయాలు
* మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం
నా స్వంత అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా ఈ దృక్కోణాలన్నింటినీ నేను తెలియజేస్తు
న్నాను. నేను, వ్యక్తిగతంగా, పై జాబితాలో అనేక సరైన కారణాలను చూడగలను, అవన్నీ యాదృచ్ఛిక క్రమంలో ఇవ్వబడ్డాయి.
అయితే, మనం ఏదో ఒక విషయంలో విఫలమవుతున్నామని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మన సమకాలీనులు తరచూ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తారు, మన పెద్దలు పగటిపూట కూడా వీధుల్లో నడవడానికి భయపడతారు మరియు మన పిల్లలు ఎన్నడూ లేని స్థాయిలో వారి భావోద్వేగాలను నియంత్రించుకోడానికి మాత్రలు తీసుకుంటున్నారు!
పెరిగిన ఈ దూకుడుకు ఎవరు లేదా ఏమి కారణం?
ఎవరికి తెలుసు? లేదా ఎవరు వేలెత్తి చూపించడానికి ధైర్యం చేస్తారు?
ఏమైనా పర్వాలేదులే అనే తత్వమున్న అరవై మరియు డెబ్బై పడులలోని సంస్కృతి, ఏమైనా పర్వాలేదులే అనే తత్వమున్న తల్లిదండ్రుల తరాన్ని తయారుచేసింది మరియు
పిల్లలకు కొంత క్రమశిక్షణ అవసరం కావచ్చు. మునుపటి తరాలు అధికారానికి చాలా లోబడి ఉండవచ్చు, ఇది మాత్రం హిప్పీలలో (అతిగా?) ప్రతిస్పందించే తత్వానికి కారణమైంది.
కొన్ని ఆహారాలు ఖచ్చితంగా అలెర్జీ సమస్యల
ను కలిగించాయి ఇంకా కలిగిస్తున్నాయి అలాగే మూడ్ మారిపోడానికి కారణమవుతాయి. కొంతమందికి మానసిక స్థితిగతులను నియంత్రించుకోవడం కష్టమౌతుంది, అలాగే అది ఆందోళనకు దారితీస్తుంది.
ముఖ్యంగా పిల్లవాడు తరగతిలో ఉన్నప్పుడు వాని ‘సంరక్షించే స్థానంలో’ (తల్లిదండ్రు
ల స్థానంలో)
వున్న పాఠశాల ఉపాధ్యాయుల అధికారాన్ని ఉపసంహరించడంలో ప్రభుత్వం దాని పాత్రను కలిగి ఉంది. పాఠశాలలో ఇలా అధికారం లేకపోవడమనేది అనేది బహుశా చెడ్డ ఆలోచన. వాస్తవానికి, కొంతమంది ఉపాధ్యాయుల అధికారాన్ని పునరుద్ధరించడం ద్వారా UK ప్రభుత్వం దీనిని నిశ్శబ్దంగా అంగీకరించింది.
అలిస్ కూపర్ యొక్క 'స్కూల్ అవుట్' మరియు పింక్ ఫ్లాయిడ్ యొక్క 'అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్' వంటి ప్రసిద్ధ సంగీతం వీటన్నిటికీ ఆజ్యం పోసింది.
ఆధ్యాత్మికతపై ఎప్పటిలాగే ఆరోగ్యకరమైన జనాదరణ పొందిన పరిశోధనాత్మకత
ఇంకా ఉన్నప్పటికీ, 'చర్చి' జీవితం మరియు పరలోకం గురించి అనేకమంది సాధారణ ప్రజల కంటే తక్కువ, లేదా కొన్నిసార్లు చాలా తక్కువ జ్ఞానమున్న మతాధికారులను కలిగి ఉన్నదని 'బహిర్గతం' చేయబడింది.
అధికారాన్ని గౌరవించే విషయంలో మరొక అపజయం. ప్రత్యేకించి UK లో MP యొక్క ఖర్చుల కుంభకోణం జరిగినప్పటి నుండి కార్ల అమ్మకందారులను ఉపయోగించిన రాజకీయ నాయకులకు తక్కువ గౌరవం దొరికింది. ప్రజా ధననిధిని దొంగిలించిన ప్రభువులు కూడా ఇదే కోవలో వున్నారు. చాలామంది తొలగించబడ్డారు మరియు ఒక జంట జైలుకు వెళ్లారు. ఉదాహరణకు స్వాభిమానం చూపించే BBC వంటి ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభుత్వ వర్గాలు ... ఇతరులు కూడా ఖచ్చితంగా అదే అనుసరిస్తారు.
ఇంకా చెప్పాలంటే, మనమందరం నిందించబడాలి. సమాజం చెదిరిపోయింది.